Monday, May 5, 2008

మాటల్లో సంక్షేమం, చేతుల్లో సంక్షోభం!

మల్లెపల్లి లక్ష్మయ్య
అక్రమంగా అసైన్డ్‌భూములను కలిగివున్నవారికి వాటిని క్రమబద్ధీకరించరాదని ఈ నెల ఒకటవ తేదీన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టానికి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సవరణను వ్యతిరేకిస్తూ, అది రాజ్యాంగపరంగా చెల్లదని, అంతేగాక ఈ సవరణ చట్టం మౌలిక స్వభావానికి విరుద్ధమని ప్రముఖ న్యాయవాది బొజ్జా తార కం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే, అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న అసైన్డ్‌ భూములను ఎవరికివారుగా అప్పగిస్తే ఎటువంటి శిక్షలు ఉండవని విధించిన గడుపు ఏప్రిల్‌ 29వ తేదీతో ముగిసింది. కానీ ఎవ్వరూకూడా అప్పగించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎవరి దగ్గర ఎంత అసైన్డ్‌ భూమి ఉన్నదనే వివరాలను సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలకే పరిమితమైతే కొంత ఆశ కలుగకమానదు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
చాలాచోట్ల పేదలు ముఖ్యంగా దళితులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. గతంలో ఎవరో ప్రైవేటువ్యక్తులు దళితుల భూమిని ఏదోవిధం గా ఆక్రమించుకునేవారు. కానీ నేడు ప్రభుత్వమే ఆ పని చేస్తున్నది. దానివల్ల ఇంకా తొందరగా పేదలు, దళితులు, ఆదివాసులు తమ చేతుల్లో ఉన్న భూములను కోల్పోతున్నారు. ఇక్కడే ఇటీవల అసెం బ్లీలో జరిగిన అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టానికి జరిగిన సవరణను ప్రస్తావించాలి. సవరణకు ముందు ఈ చట్టం అసైన్డ్‌ భూములు పొందినవాళ్ళకు రక్షణగా ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. 'అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను ప్రభుత్వం తిరిగి స్వా ధీనం చేసుకొని ఎవరికైతే కేటాయించారో వారికే తిరిగి ఇవ్వాలి' అని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సవరణ దానికి భిన్నంగా ఉన్నది. అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని గతంలో ఎవరికైతే కేటాయించారో వారికే ఇవ్వవచ్చు, అవసరాన్నిబట్టి, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉం చుకుని ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.
ప్రైవేట్‌ వ్యక్తుల కు కూడా కేటాయించవచ్చునని మార్చారు. ఇది ప్రభుత్వ వ్యూహా న్ని తెలియజేస్తున్నది. సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండళ్ళ) ఏర్పాటు చేయాలనే ఆలోచనను దృష్టిలో ఉంచుకునే ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజా ప్రయోజనాల పేరిట ఏర్పాట య్యే ఎటువంటి సంస్థలు, పరిశ్రమలు, పార్కులు అన్నింటికీ ఎక్కువగా దళితుల భూములనే ముందుగా లాక్కున్నారు. మన హైదరాబాద్‌ నగరంలో 30 ఏళ్ళ క్రితం నిర్మించిన ఇందిరాపార్క్‌ కోసం దళితుల చేతుల్లో ఉన్న పదెకరాల భూమిని ప్రభుత్వం లాక్కున్నది. దానిపక్కనే ఉన్న ఒక ఒక ఆధిపత్యకులానికి చెందిన వ్యక్తి భూమిని ముట్టుకోనైన లేదు. ఆ వ్యక్తి ఆ భూమిని అమ్ముకుని కోట్లు సంపాదించుకున్నాడు. ఇది ఒక ఉదాహరణ. నగరం అవతల ఏర్పాటైన అనేకమైన సంస్థలు కూడా అసైన్డ్‌భూములనే తేలికగా లాగేసుకున్నాయి. ఇవేకాకుండా రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం వేలా ది ఎకరాల భూదాన్‌ భూములను వ్యాపారులు దళిత రైతులనుంచి అక్రమంగా ఆక్రమించుకున్నాయి.
దీనిపై ఎన్నో కేసులు నమోదు అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. నగరం చుట్టూ ఈ రోజు జరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దళితుల భూములనే కబళిస్తున్నది. ఇట్లా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి వారికి స్వాధీనం చేయకుండా, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారికే ఆ భూమిని అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం శోచనీయం. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (1989) ప్రకారం ఎవరైనా అక్రమంగా దళితుల భూములను ఆక్రమించుకుంటే, వారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయాల్సి ఉంటుంది. నిజానికి ము ఖ్యమంత్రి కుటుంబం ఆ ప్రాసిక్యూషన్‌కు సిద్ధం కావాల్సి ఉండింది. చట్టాన్ని గౌరవించి అలా చేసి, మిగతావాళ్ళందరిని ఆ ప్రకారం శిక్షి స్తే, ముఖ్యమంత్రి ఆదర్శనాయకుడు అయ్యేవాడు. కానీ ఆయనే చట్టంనుంచి తప్పుకోవడానికి అసైన్డ్‌ చట్టానికి సవరణ తేవడంతోపాటు, మిగతావాళ్ళందరిని రక్షించే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు.
దీనివల్ల దళితులు, పేదలు, ఆదివాసులు అభివృద్ధిలో మ రింత కిందికి అంటే పాతాళానికి దిగబడక తప్పని స్థితి. ఇందిరమ్మ రాజ్యం నడుపుతున్నట్లు ప్రచారం చేస్తున్న ప్రభు త్వం ఆమె అనుసరించిన విధానాలకు భిన్నంగా మాత్రమేగాక, పూర్తిగా ఆ ఆనవాళ్లు లేకుండా ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా దళితులకు, పేదలకు ఇందిరమ్మ కాలంలోనే భూములు దక్కాయి. అది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. దానివల్లనే ఇప్పటికే ఇందిరమ్మ పట్ల ఎస్సీ, ఎస్టీలు ఎంతో గౌరవాన్ని, భక్తిని కలిగివున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇందిర మ్మ పేరును మలినం చేసేవిధంగా ఉంది. మహబూబ్‌నగర్‌జిల్లా బాలానగర్‌ మండలం పోలేపల్లి గ్రామం లో పేదలు, దళితులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ గ్రామం జడ్చర్లకు దగ్గరలో ఉంది. గ్రామం కొంత లోపలికి ఉన్నప్పటికీ భూములు మాత్రం బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్‌పార్కు పేరుతో ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూమిని సేకరిం చింది. ఇందులో 400 ఎకరాలకుపైబడి పట్టా భూమికాగా, మిగతాది దళితులకు, లంబాడాలకు ఇచ్చిన అసైన్డ్‌ భూమి. ప్రజలంతా వ్యతిరేకించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమి లక్షన్నరగా, కొద్దిగా లోపలికి ఉంటే లక్ష, మరికొంత లోపలికి ఉంటే 50 వేల రూపాయల ధరతో పట్టా భూములను ప్రభు త్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సేకరించింది. అయితే దీనికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీల దగ్గర తీసుకున్న అసైన్డ్‌భూమికి ఎకరానికి కేవలం రూ. 18 వేల ధరను నిర్ణయించారు. కానీ వీళ్ళకు చెల్లించింది మాత్రం రూ. 9 వేలేనని చెబుతున్నారు. ఇదొక కథ. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రంగు మారింది. ఇదే గ్రీన్‌పార్కును సెజ్‌గా మార్చారు. అరబిందో, హెట్రో ఫార్మాసూటికల్‌ కంపెనీలకు ఈ భూమిని ప్రభుత్వం అమ్మివేసింది. ఎస్సీ, ఎస్టీలు, బీసీల దగ్గర రూ.18వేల నుంచి లక్షన్నర చెల్లించి స్వాధీనం చేసుకున్న భూమిని ఈ కంపెనీలకు ఎకరాకు తొమ్మిది లక్షలకు అమ్మారు.
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా ప్రభుత్వం ఇక్కడ అవతారం ఎత్తింది. ఈ తీరును ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా సెజ్‌ల పేరుతో సేకరిస్తున్న భూమిలో ఎక్కువభాగం పేదలు, దళితులదే. చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పనిచేయడానికి బదులుగా పారిశ్రామికవేత్తల, ఆధిపత్యకులాల కొమ్ముకాస్తున్నదనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కరలేదు. ఒకవైపు భూముల ను లాక్కుంటున్నది, రెండోవైపు ఆ భూములను పేదలకు పంచుతున్నామని ప్రచారం చేసుకుంటున్నది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్కువశా తం నిధులను భూములున్న రైతులకు, పరిశ్రమలు ఉన్న ఆధిపత్యకులాలకు పెంచిపెడ్తూ, చట్టపరంగా రావాల్సిన నిధులను కూ డా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం లేదు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే, తమదే సంక్షేమరాజ్యమని చెప్పుకోవడం వైరుధ్యంకాదా? ఇటువంటి విధానాలతో నడుస్తున్న ప్రభుత్వంనుంచి పేదలు, దళితులు, ఆదివాసీలు ఏదైనా ప్రయోజ నం ఆశిస్తే అత్యాశకాక మరేమవుతుంది.

Friday, May 2, 2008

Rejoice the death of Telangana farmers in Polepalli

Let's embrace today the rose thorns
and play holi in courtyard of dora's gadi
for the lips that got sealed tight over pothireddypadu dam

Let's sing till throats slit in praise of
the courage for waving rose colored flag
in honor of those who sold away Telangana lands

Lets lick armpits and felicitate sacrifices of those
who butchered at the village bodrai
the umbilical cord of land with the farmer

Why think of whatever happens to anybody
isn't Telangana that is all we need after all?
And……..
bury each other in our asses as there is no land left for a graveyard
Long live Telangana

ex-pression in words the anger of Polepalli SEZ farmers

by - Madhu Kagula
Mahbubnagar District Convenor,

Telangana Aikya Karyacharana Committee

Translated by -
M. Bharath Bhushan

PS: explanation of local context may be required for things like rose thorns, rose flag, dora gadi and bodrai. otherwise its the SEZ as elsewhere

CRY FROM THE LAND OF FARMERS SUICIDES

పోతిరెడ్డిపాడు పై పెదవి విప్పని
గులాబి ముళ్ళని కౌగిలించుకుని
దొరల గడిల ముంగల హోలీ ఆడుదాం

తెలంగాణ భూముల్ని తెగనమ్మినోనికి
గులాబి జెండానూపి దారిచూపినోని నమ్మకానికి
గొంతులు తెగేదాక పాటపాడుదాం

వూరి బొడ్రాయి దగ్గర sez ఖడ్గంతో
రైతుకు భూమికి వున్న పేగుబందాన్ని తెగనరికినోని
త్యాగానికి సన్మానం చేసి సంకనాకుదాం

ఎవదేమైతే మనకేమి?
తెలంగాణ వస్థె చాలు
ఫిర్ .................
పాతిపెట్టుకోటానికి జాగలేక
ఒకని ముడ్లొ ఒకన్ని బొందపెట్టుకొందాం
జై తెలంగాణ

"పోలేపల్లి రైతుల ఆక్రోషానికి అక్షర రూపం"

మీ...
మధు కాగుల

జిల్లా కన్వీనర్
తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటి, మహబూబ్ నగర్

సెజ్ ల రద్దులో గోవా దారి.............ఎన్.వేణుగోపాల్


ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేస్తూ, తన పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయబోనంటూ గోవా రాష్ట్రప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో గోవా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రజల ఒత్తిడివల్ల తీసుకోక తప్పని నిర్ణయం, ఒక ఆశావహమైన మార్పుకు సంకేతంగా ఉంది.
గోవా మూవ్ మెంట్ అగెనెస్ట్ సెజ్ (జి ఎం ఎ ఎస్) అనే విభిన్న సంస్థల, రాజకీయ పక్షాల ఐక్య సంఘటన గత కొద్ది కాలంగా చేస్తున్న ఆందోళన ఫలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ ఐక్య సంఘటనలో భారతీయ జనతాపార్టీ, గోవా సురాజ్ పార్టీ వంటి రాజకీయపక్షాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. ఈ ఐక్యసంఘటనతోపాటే చర్చి సంస్థలకు అనుబంధంగా ఉన్న ఆక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థ, గోవా బచావ్ అభియాన్ అనే సంస్థకూడ గోవా నుంచి ప్రత్యేక ఆర్థిక మండలాలను పూర్తిగా రద్దుచేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.కొంతకాలంగా సాగుతున్న సెజ్ వ్యతిరేక ఆందోళన డిసెంబర్ చివరి వారంలో తీవ్రరూపం దాల్చింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ పర్యాటకశాఖ మంత్రి మతనీ సల్దానా, జి ఎం ఎ ఎస్ నాయకుడు క్రిస్మస్ తర్వాత తమ ఆందోళనను ఉధృతంచేస్తామని, నూతన సంవత్సర ఉత్సవాలకు గోవాకు వచ్చే పర్యాటకులు వెళ్లిపోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని కూడ హెచ్చరించారు. గోవన్లు తమ పిల్లల భవిష్యత్తు కోసమూ, గోవా ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడడం కోసమూ సంవత్సరాది ఉత్సవాలను త్యాగం చేయవలసి ఉంటుందని కూడ ఆయన పిలుపు ఇచ్చారు.
రాష్ట్రంలోని అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దుచేయాలని కోరుతూ ఈ ఐక్య సంఘటన డిసెంబర్ 12 న ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కు ఒక విజ్ఞప్తి చేసింది. అప్పటికే రాష్ట్రంలో మొత్తం ఏడు ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటిలో రెండిటి విషయంలో ఉత్తర్వులు కూడ వెలువడ్డాయి గాని, ప్రజా ఆందోళనల వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు. ఒకవైపు ఈ ఆందోళన సాగుతుండగానే దక్షిణ గోవాలోని సాంకోలె లో మూడో ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ లోగా ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గోవాలో రెండు రోజుల పర్యటనకోసం రాగా ఆయన పాల్గొన్న సభలలో కూడ నిరసన ప్రదర్శనలు సాగాయి.
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని సమీక్షిస్తుందనీ, ఆ విషయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తయారుచేసిన శ్వేత ప్రత్రాన్ని నిశితంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుందనీ ముఖ్యమంత్రి అన్నారు.
ఈ వ్యవహారాలన్నీ పరిగణనలోకి తీసుకున్న పాలకపక్షం కాంగ్రెస్ ఒక పరిశీలక బృందాన్ని నియమించింది. ఆ బృందం డిసెంబర్ 29 న ఇచ్చిన తన నివేదికలో గోవాలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయడం గోవా ప్రయోజనాలకు గాని, గోవన్ల ప్రయోజనాలకు గాని ఉపయోగకరం కాదని ప్రకటించింది. దక్షిణ గోవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుడు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఆ బృందం అభిప్రాయాలను పత్రికలకు వెల్లడిస్తూ, సెజ్ ల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి విపరీతంగా గోవాలోకి జనం తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల రాష్ట్ర పర్యాటక రంగం మీద తీవ్రమైన ప్రభావం కలగవచ్చునని చెప్పాడు. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగితే గోవాకు ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం దెబ్బతినిపోతుందని అన్నాడు.
ఈ పూర్వరంగంలో గోవన్ల భూమిని పెద్ద ఎత్తున గోవనేతరులకు అమ్మడం, అన్యాక్రాంతం కావడం జరుగుతున్నదని, దాన్ని ఆపివేయాలని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోరింది. ప్రజా అవసరాల కొరకు మినహా ఈ విధంగా పారిశ్రామిక వేత్తల, పెట్టుబడిదారుల అవసరాల కొరకు ప్రభుత్వం భూసేకరణ జరపగూడదని కూడ ప్రదేశ్ కాంగ్రెస్ కోరింది.
చివరికి స్వయంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆర్థిక మండలాలను రద్దు చేయాలని డిసెంబర్ 30న నిర్ణయం తీసుకున్నది. పారిశ్రామికీకరణ ఫలాలను రాష్ట్రానికి అందించాలనే, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యాలతోనే రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఆ రెండు పనులూ ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయకుండా కూడ సాధించవచ్చునని టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. అంతేకాక, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మినహాయింపులు, రాయితీల వల్ల కూడ గోవా రాష్ట్రప్రభుత్వం సాధించబోయే ఆదాయం కూడ ఏమీ ఉండబోదని టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. ఆదాయం ఏమీ లేకపోగా, ప్రత్యేక ఆర్థిక మండలాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడంకోసం రాష్ట్రప్రభుత్వం అదనపు ఖర్చు కూడ పెట్టవలసి ఉంటుంది, నీరు, విద్యుత్తు కల్పించవలసి ఉంటుంది అని టాస్క్ ఫోర్స్ వ్యాఖ్యానించింది. వేలాది ఎకరాలను సెజ్ లకోసం కేటాయించడం వల్ల నిజంగా పరిశ్రమలు ఏర్పాటు చేయదలచుకున్న వారికి గాని, సాధారణ ప్రజల నివాస అవసరాలకు గాని భూమి దొరకదని కూడ టాస్క్ ఫోర్స్ అంది.
గోవాలో ఒక పాలకపక్ష పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలలోని పాలకపక్షాలన్నిటి కళ్లు తెరిపించాలి. నిజానికి మన దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు అంటున్న మాటలే ఇవి. ప్రత్యేక ఆర్థిక మండలాలవల్ల స్థానిక ప్రజల ప్రయోజనాలేవీ తీరవని, అవి కేవలం దేశదేశాల సంపన్నులకు మన సంపదలు దోచిపెట్టే సాధనాలు మాత్రమేనని రాజకీయ పక్షాలన్నిటికీ కూడ తెలుసు. కాని అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు సంపాదించడం కోసమో, తమ ఆశ్రితులకో, కుటుంబ సభ్యులకో వేలాది ఎకరాల భూములు కట్టబెట్టడం కోసమో ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని తలకెత్తుకుంటున్నాయి. ఇవాళ మొదటిసారి గోవా ప్రభుత్వం అధికార పక్షంగా ఉండి కూడ ప్రజల ఒత్తిడి మేరకు నిజాలు అంగీకరించి, ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని వెనక్కి తీసుకున్నది.
ఈ విధంగా ప్రత్యేక ఆర్థిక మండలాల విధానాన్ని ఉపసంహరించే పని ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా చేసింది గాని మిగిలిన పార్టీలేవీ తాము పాలిస్తున్న రాష్ట్రాలలో చేయలేకపోయాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర లలో తప్ప దేశమంతా ప్రత్యేక ఆర్థిక మండలాల విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వామ పక్షాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల కొరకు తమ భూమి లాక్కోవద్దన్న రైతుల ప్రాణాలు బలిగొన్న వామపక్షాలు గోవా ప్రభుత్వం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
ప్రత్యేక ఆర్థిక మండలాల వెనుక బహుళజాతిసంస్థలు, దేశదేశాల సంపన్నులు ఉన్నప్పటికీ బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించగలిగితే ప్రభుత్వం మెడలు వంచి ఉపసంహరించేలా చేయవచ్చునని చూపిన గోవా ప్రజా ఉద్యమం అన్ని రాష్ట్రాలలో సెజ్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు ఆదర్శం కావాలి.

పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?........ఎన్.వేణుగోపాల్

అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, హైదరాబాదునుంచి దక్షిణంగా వెళ్లే జాతీయరహదారిమీద దేశదేశాల సంపన్నుల పెట్టుబడులు ప్రవహించి రాష్ట్రాన్నీ, దేశాన్నీ అందలాలెక్కిస్తాయనీ అమెరికాతో సమానంచేస్తాయనీ ఏలినవారూ వారిబంట్లూ నమ్మబలుకుతున్న దారి పక్కన ఏం జరుగుతున్నదో చూడండి. నిన్నటిదాకా మనుషులు కలకలలాడినచోట సమాధులు లేచి నిలుస్తున్నాయి. అంతులేని విషాదం విస్తరిస్తోంది. పల్లె కన్నీటిధారలు ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి. పచ్చని పంటపొలాలు బహుశా రసాయనాలకంపు కొట్టబోయే మొండిగోడలుగా లేచినిలుస్తూ జీవితాలను కూల్చేస్తున్నాయి. పాలకుల అభివృద్ధి మాయాజాలం నిరుపేదబతుకులను వలవేసి పట్టి మట్టుబెడుతోంది.
ఆ ఊరిపేరు ప్రస్తుతానికి పోలేపల్లి కావచ్చు. ముదిరెడ్డిపల్లి కావచ్చు. గుండ్లగడ్డ తండా కావచ్చు. నిన్న కాకినాడో, తడో, సత్యవేడో, సూళ్లూరుపేటో కావచ్చు. అంతకుముందు ఒరిస్సాలో పారాదీప్, కళింగనగర్ లు కావచ్చు. ఉత్తరప్రదేశ్ లో దాద్రి కావచ్చు. హర్యానాలో జజ్జర్ కావచ్చు. పశ్చిమబెంగాల్ లో నందిగ్రామ్, సింగూర్ లు కావచ్చు. మహారాష్ట్రలో రాయగడ్ కావచ్చు. పంజాబ్ లో బర్నాలా, అమృతసర్ లు కావచ్చు. పేర్లే మారతాయిగాని దేశంలో కనీసం మూడువేల గ్రామాలలో కనీసం పదిలక్షల కుటుంబాలలో చిచ్చుపెట్టబోతున్న “వెలుగు” ఇది. తాతముత్తాతలనాటినుంచి తమ బొడ్రాయితో, తమ కూరాటికుండలతో, తమ గుడిసెలతో, తమ జొన్నకర్రలతో, తమ కట్టమైసమ్మలతో, పోశమ్మలతో, తమ ఏడ్పులతో నవ్వులతో పండుగలతో ప్రమాదాలతో తమవైన బతుకులు బతికిన ఊళ్లు ఇప్పుడిక చెరిగిపోతాయి. ప్రత్యేక ఆర్థిక మండలం అనే కొత్త మాయదారి పేరు అద్దుకుంటాయి.
ఇవాళ్టికి పోలేపల్లి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఆ ఊరు, ఆ ఊరి ప్రజలు చేసిన పాపమల్లా హైదరాబాదు అనే దీపం నీడ కింద ఉండడమే. బహుళజాతిసంస్థల, ప్రపంచీకరణ శక్తుల, దేశదేశాల సంపన్నుల కళ్లు పడ్డప్పటినుంచీ, నూతన ఆర్థిక విధానాల మహమ్మారి సోకినప్పటినుంచీ ఆ దీపం కాంతి రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతగానే దానికిందనీడలూ పెరిగిపోతున్నాయి. ఆ పెరుగుతున్న వెలుగుకు కావలసిన చమురుకోసం చుట్టూ ఐదు జిల్లాల ప్రజల పొట్టకొట్టడం మొదలయి చాల రోజులయింది.
ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది ఎకరాలను “అభివృద్ధి” అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలేపల్లి చుట్టుపట్ల వందల ఎకరాలనుంచి ప్రజలను వెళ్లగొట్టి పెద్దల అవసరాల కోసం అప్పగించాలని 2001లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సిఇఓ నిర్ణయించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆ భూమంతా ఎప్పుడో 1894లో వలసవాద ప్రభుత్వం చేసిన భూస్వాధీన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) సొంతమయిపోయింది. అప్పటినుంచి ఆ భూమిమీద ఎవరెవరి కళ్లుపడ్డాయో తెలియదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. కాని పాలకుల నీతి ఏమీ మారలేదు. పాలకులు అనుసరించే రాజకీయార్థిక విధానాలు వారి జెండాలతో, ప్రకటనలతో నిమిత్తం లేకుండా యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడేడు సముద్రాల అవతలి తెల్లదొరలు పెట్టిన షరతుల ఫలితంగానో, వాళ్లు విసిరిన ఎంగిలిమెతుకులమీద ఆశతో స్వచ్ఛందంగానో స్వతంత్రభారతపాలకులు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేసిన ఆ రాజకీయార్థిక విధానాలలో ఒకానొక అధ్యాయమయిన ప్రత్యేక ఆర్థిక మండలాలు మొదలయ్యాయి.
ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లు ఇవ్వజూపుతున్న రాయితీల, సౌకర్యాల ఆకర్షణలో రాష్ట్రం నుంచి ఔషధ పరిశ్రమ తరలిపోతున్నదని, ఆ రెండు రాష్ట్రాలలో వందల పరిశ్రమలు వచ్చాయని, ఆంధ్రపదేశ్ నుంచే నలభై యాభై సంస్థలు తరలి వెళ్లాయని 2006 మొదట్లో గగ్గోలు మొదలయింది. ప్రతిస్పందనగా పాలకులు ఔషధ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేకఆర్థికమండలాన్ని స్థాపిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో మొదట 300 ఎకరాలతో ప్రారంభించి క్రమంగా వెయ్యి ఎకరాలకు విస్తరించగల సెజ్ ను ఔషధ పరిశ్రమకోసం ఎపిఐఐసి ఏర్పాటు చేయబోతున్నదని 2006 సెప్టెంబర్ లోనే వార్తలు వెలువడ్డాయి. నిజానికి సెజ్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినది 2005 మే లో. ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలు తయారయినది 2006 ఫిబ్రవరిలో. కాని సెప్టెంబర్ కల్లా రాష్ట్రప్రభుత్వం ఔషధ సెజ్ ఆలోచన ప్రకటించడం, అక్టోబర్ లో కేంద్రప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన అనుమతుల బోర్డు ఈ సెజ్ కు అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ కేంద్రప్రభుత్వ ఉత్తర్వు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ లో, జడ్చర్ల మండలం పోలేపల్లిలో 101.17 హెక్టార్ల విస్తీర్ణంలో ఫార్ములేషన్ పరిశ్రమకోసం సెజ్ స్థాపించడానికి అనుమతించింది. అరబిందో ఫార్మాసూటికల్స్, హెటెరోడ్రగ్స్ అనే పెద్ద సంస్థలు, మరికొన్ని చిన్నసంస్థలు ఇక్కడ తమ ఔషధ ఉత్పత్తి ప్రారంభిస్తాయని 2006లో అన్నారు. కాని అప్పుడు ఆపేరుతో భూమి సంపాదించుకున్న సంస్థలు కూడా ఇప్పుడు వెనక్కిపోతున్నాయని తెలుస్తోంది. అయినా చట్టప్రకారమే ఒకసారి సెజ్ గా ప్రకటించినతర్వాత సంపాదించిన భూమిలో 35 శాతాన్ని మాత్రమే చెప్పిన పనికి ఉపయోగించి, మిగిలిన 65 శాతాన్ని తమ ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి ఆ సంస్థలకు అనుమతి దొరుకుతుంది. క్రమక్రమంగా ఆ 101 హెక్టార్లు (249 ఎకరాలు) పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఎంత విస్తీర్ణానికి చేరాయో, ఏ ఔషధ కంపెనీల పేరుమీద ఏ రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి చేరాయో తెలియదు.
ఉత్తరాది రాష్ట్రాలలో తమకు అందుతాయని రాష్ట్రప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి చూపిన రాయితీలు - పది సంవత్సరాలపాటు ఎక్సైజ్ సుంకంపై మినహాయింపులు, అమ్మకంపన్ను, ఆదాయపుపన్ను పూర్తిగా రద్దు. అంటే ఇప్పుడు పోలేపల్లి సెజ్ లో ఔషధ సంస్థలు వస్తే గిస్తే కూడా అవి ఎక్సైజ్ సుంకాలు కట్టనక్కరలేదు. అమ్మకపు పన్నులు చెల్లించనక్కరలేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రజల భూమిని వాడుకుని, ప్రభుత్వం కల్పించిన విద్యుత్తు, నీరు, రవాణా, సమాచార సౌకర్యాలన్నిటినీ వాడుకుని, చౌకశ్రమతో సంపాదించిన లాభాలపై ఆదాయపు పన్ను కూడ కట్టనక్కరలేదు. మరి దేశానికీ రాష్ట్రానికీ రాష్ట్ర ఖజానాకూ వీసం కూడా లాభం చేకూర్చని, కేవలం పెట్టుబడిదార్ల లాభాలను మాత్రమే ఇబ్బడిముబ్బడిగా పెంచే ఈ పథకానికి ప్రజలు ఎందుకు త్యాగం చేయాలి? ప్రజలు తమ భూములనూ, భవిష్యత్తునూ, ప్రాణాలనూ ఎందుకు బలిపెట్టాలి? ప్రజలు తమ తాతముత్తాతలనాటినుంచి ఉన్న స్థలాలనుంచి ఎందుకు తొలగిపోవాలి?
అలా తొలగిపోయిన రైతులకు నష్టపరిహారం వస్తుందిగదా, ఇక సమస్య ఏమిటి అని కొందరు బుద్ధిమంతులు ప్రశ్నిస్తారు. కాని శాశ్వత జీవనాధారమైన భూమిని లాక్కొని ఏదో కొంత డబ్బు విదిలిస్తే అది ఎటువంటి జీవనోపాధిని, జీవన భద్రతను కల్పించగలుగుతుంది? అది కూడ మొదట ఎకరానికి రు. 18,000 నుంచి రు. 30,000 అన్నప్పటికీ లంచాలు పోగా అందులో నాలుగోవంతు కూడ బాధితులకు దక్కలేదు. ఆ కొద్దోగొప్పో నష్టపరిహారం కూడ దక్కేది భూమి ఉన్న రైతులకు మాత్రమే. మన గ్రామాలలో కనీసం సగం జనాభా అయినా భూమిలేని నిరుపేదరైతులు. వారికి దక్కేది ఏమీ ఉండదు. మరోవైపు చేతులుమారిన భూమి ఇప్పుడు పలుకుతున్న ధర ఎకరానికి నలభై లక్షల రూపాయల పైనే.
అలా తమ పొలాల నుంచి, తమ గ్రామం నుంచి బేదఖల్ చేయబడి, తమ భూములమీద తామే నిర్మాణ కూలీలుగా మారిన వేదనతో, తమ భూమి తీసుకోవద్దని పోరాడినందుకు ప్రభుత్వం బహూకరించిన లాఠీ దెబ్బలు, అరెస్టులు, జైళ్లు, కేసులు వంటి బహుమానాల అవమానాలతో, వేదనతో ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ల సంఖ్య ఇరవై నుంచి నలభై ఐదు దాకా ఎంతయినా కావచ్చు.
ఈ పాపంలో మనందరం తలాపిడికెడు పంచుకోవలసిందే. నూతన ఆర్థిక విధానాలను తెచ్చిన పాలకులు, ఆ విధానాలను గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగిస్తున్న అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాన్ని తాము పాలిస్తున్న రాష్ట్రాలలో అమలు జరుపుతూ, ఇతరరాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ పక్షాలు ఈ దుర్మార్గానికి ప్రధాన బాధ్యులు. ప్రపంచీకరణ విధానాలను ఆమోదించి ఆహ్వానించిన పత్రికలు, ప్రచార సాధనాలు, ప్రపంచీకరణ వల్ల తమ విలాసాలు పెరిగితే చాలునని, పొరుగువాళ్లు ఏమయిపోయినా ఫరవాలేదని నిర్లిప్తతలోకి వెళ్లి, గొంతులేనివాళ్లకు గొంతునివ్వవలసిన సామాజిక బాధ్యత మరిచిపోయిన మధ్యతరగతి కూడ ఈ విషాదగాథలకు బాధ్యత వహించాలి. మాట్లాడగలవాళ్ల మౌనమే అసలు సమస్య.

ఇదె నిజం...ఈ జీవచ్ఛవాలే సాక్షి


మె పేరు బాలమ్మ.. చేతిలోని చిత్రం భర్త దేపల్లి వెంకయ్యది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం, అటు తర్వాత ఫార్మా ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం జరిగిన భూసేకరణలో జీవనాధారమైన భూమి కోల్పోయి.. ఉపాధి కరవై.. కుటుంబాన్ని పోషించలేక పుట్టెడు దిగులుతో వెంకయ్య ప్రాణాలు కోల్పోయాడు. 'ఉసురు తీసిన సెజ్‌' శీర్షికన ఈనెల 18న 'ఈనాడు' రాసింది ఈయన గురించి. వైఎస్‌ తనయుడి పత్రిక 'సాక్షి'.. ఆ వూళ్లో ఇద్దరే వెంకయ్యలున్నారని, ఇంకెవరూ లేరని బొంకింది. మరి ఈ వెంకయ్య భార్య బాలమ్మకేం సమాధానం చెబుతుంది? వీరికి ఎకరా భూమి ఉంది. దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక ఆర్థిక మండలికి ఇచ్చింది. ఉన్న ఎకరా పోవడంతో ఇక ఎలా బతుకుతామని దిగులుపడి తన భర్త మరణించాడని బాలమ్మ రోదిస్తూ శుక్రవారం తనను కలిసిన 'న్యూస్‌టుడే' ప్రతినిధికి చెప్పింది.
'పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక'- 'సాక్షి'
ఫ్యాక్షనిజంలో పుట్టి, 'ఈనాడు'పై పగబట్టి 'ఏది నిజం' పేరిట సర్వాబద్ధాల్ని ప్రచురిస్తూ అక్షరాలా రాజకీయ కక్షకు సాక్షీభూతంగా నిలుస్తోంది 'సాక్షి'!

ముప్ఫై మూడేళ్ల క్రితం పుట్టింది 'ఈనాడు'. తెలుగువారి ఆదరాభిమానాలే కొండంత అండగా ఎదిగిన 'ఈనాడు'కు ఎల్లవేళలా సత్యనిష్ఠ, ప్రజాప్రయోజనాలే ప్రాణస్పందనలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలపక్షాన అక్షర అక్షౌహిణుల్ని మోహరించి జనహితం తెగటారిపోకుండా కాచుకోవాలన్నదే 'ఈనాడు' ఏకైక లక్ష్యం. అందుకోసమే సాగిస్తోంది అసిధారావ్రతం!
ముప్ఫై మూడు రోజుల క్రితం పుట్టింది 'సాక్షి'. తెలుగు పాత్రికేయంలో కొత్తగా వచ్చిన పత్రిక ఉన్నత వృత్తిప్రమాణాలకు కట్టుబడితే, కనీసం తానే శిరసున దాల్చిన 'సత్యమేవ జయతే'కు నిబద్ధత చాటితే పరిస్థితి భిన్నంగా ఉండేది. వచ్చిన రోజునుంచే వైఎస్‌ తనయుడి పత్రిక తండ్రి అజెండాకు అనుగుణంగా 'ఈనాడు'పై దాడిచేస్తోంది. పాఠకుల్లో గల అచంచల విశ్వసనీయతే 'ఈనాడు' మహాసౌధానికి పునాది. దాన్ని కదలబార్చడం కోసమే అబద్ధాలకు రంగులద్ది జనంలోకి వదులుతున్నారనడానికి జడ్చర్ల కథనమే తిరుగులేని సాక్ష్యం!
నిజం నిప్పు కణిక. కట్టుకథల నివురుగప్పినా అది జ్వలిస్తూనే ఉంటుంది. కోర్టులో అబద్ధపు సాక్ష్యమిచ్చేవారూ తాము సత్యహరిశ్చంద్రుడికి సన్నిహిత బంధువులమని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అబద్ధాల సాక్ష్యాల తయారీకోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుంటారు. నిజాలకు పాతరేసి, అబద్ధాల జాతర మొదలెట్టిన 'సాక్షి' దినపత్రికదీ ఇదే తంతు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తిమ్మినిబమ్మిని చేస్తోందనడానికి జడ్చర్ల సెజ్‌పై ఆ పత్రిక ప్రచురించిన కథనమే సాక్షి! జడ్చర్ల సెజ్‌లో తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న అభాగ్యుల గుండెల్ని అసత్యపు అక్షర రంపాలతో సాక్షి నిలువునా కోసింది. సెజ్‌లో సమిధలైన పాతికమందికి పైగా అభాగ్యుల కష్టాల్ని 'ఈనాడు' కళ్లకు కడితే... కాదంటూ సవాలుచేసిందీ పత్రిక. కానీ తాను చెప్పిందే నిజమని ససాక్ష్యాధారాలతో నిరూపిస్తోంది 'ఈనాడు'. ముందే వాస్తవాలు నిర్ధారించుకొని కథనాన్ని ప్రచురించినా... బాధ్యత గల పత్రికగా మరోసారి ఈనాడు, ఈటీవీ ప్రతినిధి బృందం శుక్రవారం పోలేపల్లి గ్రామానికి వెళ్లి వాస్తవాలు మరోసారి ధ్రువీకరించుకుని బాధితుల గోడుకు అక్షరరూపం ఇస్తోంది.
పోలేపల్లి నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధులు
నాదిగా భూమి, రైతు మధ్య బంధం విడదీయలేనిది. కానీ ఇప్పుడా పేగుబంధాన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌) తెగ్గోస్తున్నాయి. పచ్చటి పొలాల్లో, చక్కటి బతుకుల్లో చిచ్చు రేపుతున్నాయి. రైతు బతుకును బజారుపాలుచేస్తున్నాయి. ప్రభుత్వం విదిల్చే పరిహారపు చిల్లర డబ్బుల్తో మరోచోట భూముల్ని కొనలేక, కూలీలుగా పనిచేయలేక రైతు రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతున్నాడు. నిన్నామొన్నటిదాకా సాగుచేసిన తమ పొలాల్లోనే కూలీగా మారుతున్నాడు. గౌరవంగా బతికిన వూర్లోనే తలదించుకోవాల్సిన దుస్థితి. జడ్చర్ల సెజ్‌లో భూముల్ని కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి.
''ఉన్న భూములు పోయాయి. ఈ బాధను తట్టుకోలేక మా భర్తలు చనిపోయారు. ఎలా బతకాలో అర్థంకావడం లేదు. మా భూముల్లోనే కూలీలుగా పనిచేస్తున్నాం. అవమానాలు ఎదుర్కొంటున్నాం''- పోలేపల్లి వద్ద సెజ్‌లో భూమిని కోల్పోయిన మహిళల దీనస్థితి ఇది. ఇక్కడ ఏ మహిళను కదిపినా కన్నీళ్లే. ''అదిగో అక్కడ జేసీబీలు పనిచేసేది మా భూమి'' అని ఒకరంటే, ''ఆ భవంతి కట్టేది మా స్థలంలోనే'' అని మరొకరు ఆవేదనతో చెబుతున్నారు. భూమిని కోల్పోయిన రైతులు కూలీలుగా మారడమే కాదు, దిగులుతో కుమిలిపోయి, విగతజీవులైన రైతులు, వారి కుటుంబాల దుస్థితిని 'ఈనాడు' వెలుగులోకి తెచ్చింది. కానీ ఇవన్నీ అబద్ధాలని, పోలేపల్లి గ్రామంలో ఇద్దరు వెంకయ్యలు మాత్రమే ఉన్నారని, వారిద్దరూ బతికే ఉన్నారని, కథనం కోసం చంపేశారంటూ అవాస్తవ, అభూత కల్పనలతో సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈనాడు పత్రికలో 'ఉసురు తీసిన సెజ్‌' శీర్షికతో ప్రచురించిన కథనంలో మరణించిన రైతులు బాలు, సీత్యానాయక్‌ ఫొటోలు వేశాం. ఈ ఇద్దరు రైతులూ చనిపోయారు. ప్రచురించిన వారి ఫొటోల కింద పేర్లు తారుమారు అయ్యాయి.
అది సాక్షి కంటికి కనిపించలేదా?
హబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి గ్రామం వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రీన్‌పార్కు పేరుతో భూసేకరణ చేపట్టింది. 2003లో 969 ఎకరాలు సేకరించింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని గ్రోత్‌ సెంటర్‌గా ప్రకటించింది. 2006 సెప్టెంబరులో ఫార్మాస్యూటికల్‌ ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించింది. అరబిందో ఫార్మా, హెట్రోడ్రగ్స్‌ తదితర కంపెనీలకు కేటాయించింది. అరబిందో ఫార్మా ప్రమోట్‌చేసిన ట్రిడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ సాక్షి దినపత్రికలో రూ.6 కోట్ల 80 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. హెట్రో డ్రగ్స్‌, ల్యాబ్స్‌, హెల్త్‌కేర్‌ సంస్థల పేరిట రూ.1.94 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆ సంస్థలున్న సెజ్‌లో అంతా సవ్యమేనని చెప్పేందుకు సాక్షి పడరాని పాట్లు పడుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే భూసేకరణ చేపట్టారని, వెయ్యి ఎకరాలు సేకరించారని ఈనాడు తన కథనం ప్రారంభంలోనే స్పష్టంగా పేర్కొన్న విషయం సాక్షి కంటికి కనిపించలేదా? ఈనాడు పత్రిక ఉద్దేశపూర్వకంగానే దీనిని పక్కనబెట్టిందంటూ సాక్షి పేర్కొనడం బాధ్యతా రాహిత్యం కాదా?






















































































































సాక్షి దినపత్రిక నుంచి...




Effects of SEZ in Mahabubnagar

ఉసురు తీసిన సెజ్
ఒకే గ్రామంలో 25 మంది బలి
తభూమిలోనే కూలీలైన రైతులు
ఎదురుతిరిగినవారిపై కేసులు
జైళ్లలో కుక్కిన యంత్రాంగం
అవమానంతో ఆత్మహత్యలు
జడ్చర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ప్రభావం

ఈయన పేరు బాలు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద పోలేపల్లి రైతు. 16 ఎకరాల ఆసామి. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తన భూమిని సేకరించడాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఇతడిని అరెస్టుచేసి జైలుకు పంపింది. అవమాన భారంతో కుంగిపోయి మరణించాడు. ఇతడే కాదు.. పాతిక మందికిపైగా రైతులు ఇలా భూసేకరణకు బలయ్యారు. రైతులను తమ పొలంలోనే కూలీలుగా మార్చేసి వారి బతుకులను ఛిద్రం చేసిన ఓ ప్రత్యేక ఆర్థిక మండలిపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనంమొన్నటిదాకా 16, 17 ఎకరాల భూస్వాములు వారు. నేడు.. తమ పొలంలోనే కూలీలుగా మారిపోయారు. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) వారి భూముల్ని మింగేసింది. కొందరి ప్రాణాలను కబళించింది. ఇంకొందరి బతుకులను ఛిద్రం చేసింది. ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటికి 25 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.. నమ్ముకున్న భూమిని కోల్పోయిన బాధను తట్టుకోలేక గుండె ఆగి కొందరు చనిపోయారు. తమ సొంత భూమిలోనే కూలీలుగా మారిన అవమానభారంతో ఇంకొందరు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు భూమిని రక్షించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆ అవమానంతో వారిలోనూ కొందరు మంచంపట్టి చనిపోయారు. బతికున్నవారూ తాము కోల్పోయిన భూముల్లోనే కూలీలుగా పనిచేస్తూ జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు.. రాష్ట్ర రాజధానికి దగ్గర్లోని జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. ‘న్యూస్‌టుడే’ ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల దయనీయ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసింది.
తెలుగుదేశం హయాంలో గ్రీన్‌పార్కు అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద భూసేకరణ చేపట్టింది. 1000 ఎకరాలు సేకరించింది. ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో రైతులే తమ భూములను సాగు చేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2005 నుంచి పరిస్థితి మారిపోయింది. రైతులు సాగు చేసుకుంటున్న భూములను సర్కారు స్వాధీనం చేసుకుంది. ఔషధ రంగానికి సంబంధించిన ప్రత్యేక ఆర్థిక మండలి కోసం కేటాయించింది. అరవిందో ఫార్మాకు 70 ఎకరాలు, హెట్రోడ్రగ్స్‌కు 80 ఎకరాలు ఇచ్చింది. కార్తీకే, మమత తదితర సంస్థలకూ భూములు కట్టబెట్టింది. ఏడాది కాలంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి వారిని అణచివేశారు. రైతులకు పరిహారం అందినా.. ఇంత తక్కువ చెల్లించిన సంఘటన రాష్ట్రంలో ఎక్కడా లేదు. అసైన్డ్‌ భూమికి ఎకరాకు రూ.18 వేలు, పట్టా భూమికి రూ.30 వేలు చెల్లించారు. ఇందులో కూడా కొంత దళారుల పాలైందని రైతులు వాపోయారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
* భద్యా అనే రైతుకున్న ఐదెకరాల భూమి పోయింది. ఇది తట్టుకోలేక భార్య చనిపోతే.. అతడూ విషం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారి పిల్లలు ఇప్పుడెక్కన్నారో కూడా తెలియదు.
* భద్రా అనే మరో రైతుదీ ఇదే పరిస్థితి. భూమి కోల్పోయిన దిగులుతో ఒకరోజు బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల గాలించారు. చివరకు బావిలో శవమై తేలాడు.
* మంగ్యా అనే రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే.. భార్య తన నలుగురు పిల్లలతో తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
* పదెకరాల భూమిని కోల్పోయిన దీప్లానాయక్‌ ముగ్గురు కుమారులు కూలీలుగా మారారు.
* అధికారులు తీవ్రంగా ఒత్తిడి చేశారని, పరిహారం తీసుకోకుంటే భూములు గుంజుకొంటామని బెదిరించడంతో కోట్యానాయక్‌ అనే రైతు మరణించాడు.
* తమ భూములు స్వాధీనం చేసుకొన్న ఏడాదికే భర్త చనిపోయారని, ఇప్పుడు పిల్లలకు పనులు ఇవ్వడం లేదని ఓ మహిళ వాపోయింది.
జైలుకు పంపారన్న అవమానంతో
భూములు కోల్పోయిన రైతులు ఇటీవల ఆందోళన చేయడంతో పోలీసులు తమ ప్రతాపం చూపి 36 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ అవమాన భారం భరించలేక కొందరు రైతులు చనిపోతే.. కొందరు ఇప్పటికీ దానిని తలుచుకుని కుమిలిపోతున్నారు. తాండాకు చెందిన బాలుకు ఉన్న 16 ఎకరాల భూమి పోయింది. ఇటీవల ఆందోళన చేసినపుడు పోలీసులు పట్టుకెళ్లారు. అవమానం భరించలేక పస్తులుండి, కుమిలిపోయి మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన కొడుకు 14 ఏళ్ల వయస్సున్న లక్ష్మణ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
* పోలేపల్లిలోని దళిత వాడకు చెందిన వల్లూరు బాలయ్య కూడా భూమిని కోల్పోయి, పోలీసులు కేసు పెడ్తే కోర్టు చుట్టూ తిరిగి అవమానం భరించలేక మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
* నాలుగు ఎకరాల భూమి ఉంటే రెండు ఫ్యాక్టరీలకు తీసేసుకున్నారని, ఈ బాధ తట్టుకోలేక తన భార్య చనిపోయిందని పోలేపల్లికి చెందిన పెద్ద పెంటయ్య చెప్పారు. ఇటీవల ఆందోళన చేసినపుడు పోలీసులు అరెస్టు చేసి నానా ఇబ్బందులు పెట్టారన్నారు. ఎవరైనా చనిపోతే శవాన్ని పూడ్చడానికి కూడా స్థలం లేదని విలపించారు.
* భూములు కోల్పోవడంతో మరణించిన వారిలో తాండాకు చెందిన తోగ్యా, దళితవాడకు చెందిన బాలయ్య, వెంకయ్య తదితరులున్నారు.

భర్త వదిలేసి ఎక్కడికో పోయాడు!
ఉన్న భూమిని ప్రభుత్వం లాగేసుకోవడంతో భర్త తనను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని నర్సమ్మ అనే మహిళ వాపోయింది. మొగిలయ్య అనే రైతుకు ఈమె కూతురు. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకే భూమిని ప్రభుత్వం తీసుకుంది. భూమి పోయాక ఉండలేనంటూ అల్లుడు వెళ్లిపోయాడు. నర్సమ్మ, మొగిలయ్య ఇప్పుడు తమ భూమిలోనే కూలీలుగా పని చేస్తున్నారు.
నిర్వాసితుల తరపున నిలబడి..
పోలేపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ ఉపేందర్‌రెడ్డి భూమి కోల్పోలేదు. యువకుడైన ఈయన నిర్వాసితులకు అండగా నిలబడి పోరాడాడు. అరెస్టయి జైలుకెళ్లాడు. పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలొదిలాడు.
నిన్నటి రైతులే నేటి కూలీలు
పోలేపల్లి, గుండ్లగడ్డ తాండాల్లో రెండేళ్ల క్రితం వరకు ఐదు నుంచి 25 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న రైతులు నేడు తమ పొలాల్లోనే కూలీలుగా మారారు.
*ఉన్న మూడెన్నర ఎకరాల భూమి పోయింది.. భర్త ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. నాకు మూడు ఆపరేషన్లు జరిగాయి. అయినా కుటుంబాన్ని పోషించడానికి ఇక్కడే పనికి రావాల్సి వచ్చిందని బాలమ్మ అనే మహిళ వాపోయింది.
కోల్పోయిన భూముల్లో రైతులందరికీ పని దొరకడం లేదు. నడివయసు దాటిన వారికి ఔషధ సంస్థలు పనులివ్వడం లేదు. తనకు వయస్సు మీరిందంటూ తిప్పి పంపారని టోప్యా అనే నిర్వాసితుడు తెలిపారు. ఈయన భార్యను మాత్రం పనిలో పెట్టుకున్నారు. ‘గతంలో పొలం దున్ని నాలుగునెలలు పనిచేస్తే ఏడాది తినేవాళ్లం. ఇప్పుడు తమ భూముల్లోనే కంపెనీల తరపున ఎండలో పెద్దపెద్దరాళ్లు మోసే పనులు చేయలేక అల్లాడుతున్నాం. మా బతుకులు చెట్లపాలు, రాళ్లపాలు అయ్యాయి’ అని గ్రామస్తులు విలపిస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి చేపట్టిన వారిని ఏమైనా అడిగితే.. ‘మాకేమీ సంబంధం లేదు, మీ దగ్గర నుంచి ఏపీఐఐసీ తీసుకుంది. వారినడగండని సమాధానం చెబుతున్నారు’ అని పలువురు వాపోయారు. ఇక్కడ కూడా కొద్దిరోజులే పని ఇస్తారని, ఫ్యాక్టరీలకు గోడలు లేచాక తమను తీసేస్తారని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని ‘న్యూస్‌టుడే’తో అన్నారు.
సీత్యానాయక్‌కు 17 ఎకరాల భూమి ఉండేది. అధికారులు భూమి తీసుకుంటామంటే ప్రత్యామ్నాయంగా భూమి ఇమ్మని ఆరునెలల పాటు అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా అధికారులు పట్టించుకుకోకుండా గ్రామంలో సమావేశం పెట్టి భూమి తీసుకొంటామని ప్రకటించారు. తట్టుకోలేక సీత్యానాయక్‌ మరణించాడని ఆయన కుమారుడు కిష్ణు తెలిపాడు.


-మకున్న 16 ఎకరాలు పోవడంతో తన భర్త సోన్యానాయక్‌ ఆవేదనతో మరణించాడని ముడావత్‌ రుక్కీ అనే మహిళ విలపించింది. ఇద్దరు పిల్లలు కూలికిపోయి వారి కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారింది. నేనెలా బతకాలని ఆమే భోరుమంటోంది.


శంకర్‌నాయక్‌కు 16 ఎకరాల భూమి పోయింది. ప్రస్తుతం రోజుకు రూ.120 కూలితో ఇక్కడే పనిచేస్తున్నానని వాపోయాడు.



17 ఎకరాలు కోల్పోయిన దిమ్సానాయక్‌ది ఇదే పరిస్థితి. కూలి చేయగా వచ్చిన డబ్బులు తిండికి మాత్రం సరిపోతున్నాయని చెప్పాడు. ఎకరాకు రూ.10వేల నుంచి రూ.16 వేల వరకు పరిహారంగా ఇచ్చారని, ఈ డబ్బుతో ఎక్కడా భూములు కొనలేని పరిస్థితిలో నిస్సహాయులుగా మిగిలిపోయామన

మూడున్నర ఎకరాల భూమిని తీసేసుకొన్న ఏడాదికే తన భర్త నరసయ్య మరణించాడని, ఆరుగురు పిల్లలను ఎలా సాకాలో అర్థం కావడం లేదని సుక్కమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.


తాను చచ్చి బతికానని ఆరు ఎకరాల భూమి కోల్పోయిన కూర్మయ్య అనే రైతు విలపించాడు. భూమి కోల్పోయిన బాధతో ఆందోళన చెంది పక్షవాతానికి గురయ్యాడు. కొన్నిరోజుల తర్వాత కోలుకుని.. ప్రస్తుతం అక్కడే కూలిగా పని చేస్తున్నాడు.
BY
ఎం.ఎల్‌. నరసింహారెడ్డి,
eenaadu 18 april 2008

మార్కెట్‌ కంటే ఎక్కువే ఇచ్చాం - కలెక్టరు వివరణ


ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే జడ్చర్లలో భూ సేకరణ
రైతుల మరణాలపై పరిశీలన చేయలేదు
మహబూబ్‌నగర్‌ కలెక్టరు వివరణ

మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపురం గ్రామాల్లో ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే అభివృద్ధి కేంద్రం (గ్రోత్‌ సెంటర్‌) కోసం భూ సేకరణ చేశామని జిల్లా కలెక్టరు ఉషారాణి తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించేలా భూ సేకరణ చేపట్టలేదని స్పష్టంచేశారు. చనిపోయిన రైతులకు సంబంధించిన సమాచారమేదీ అధికారుల వద్ద లేదన్నారు. ఆ మరణాలు ఎలా జరిగాయో.. ఎందుకు జరిగాయో పరిశీలించలేదని ఆమె శనివారమిక్కడ విలేఖరులకు తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆ రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను పూర్తిగా వివరించలేకపోతున్నట్లు చెప్పారు. అరబిందో ఫార్మా, హెట్రో డ్రగ్స్‌ సంస్థలు గత ఎనిమిది నెలల్లో బాధిత రైతుల డిమాండ్‌ మేరకు కొన్ని పనులు చేపట్టాయని తెలిపారు. ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు ఆ సంస్థలు పోలీసులకు లేఖ రాశాయని తనకు తెలుసన్నారు. భూ సేకరణలో అతి తక్కువ ధరకు ప్రభుత్వం తీసుకుందనే ఆరోపణలు వాస్తవం కాదని చెప్పారు. ‘2002లో జడ్చర్ల పరిధిలో భూముల విలువ చాలా తక్కువగా ఉంది. రైతులు ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి ముందుకొచ్చాకే భూ సేకరణ చేశాం. ఏపీఐఐసీకి 969 ఎకరాలు సేకరించాం.. ఎకరాకు మార్కెట్‌ విలువ రూ.12 వేలుంటే.. ప్రభుత్వం 30 శాతం అదనంగా చెల్లించింది. ఇలా ఇచ్చిన అప్పటి ఆర్డీవో జయరామయ్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గ్రీన్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నించినా ఎవరూ రాకపోవడంతో సుమారు 250 ఎకరాలను సెజ్‌కు కేటాయించారు. ఒక్కో ఎకరాకు రూ.7 లక్షల చొప్పున కేటాయించడంతో రైతులు ఆందోళనకు దిగారు. మా వద్ద తక్కువ ధరకు తీసుకుని ఎక్కువ ధరకు ఏపీఐఐసీ అమ్ముతోందని అడ్డుకున్నారు. నాకు చాలా వినతిపత్రాలు ఇచ్చారు. చట్టప్రకారం జరిగిన భూసేకరణలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని చెప్పాం.. నిరుడు అరబిందో, హెట్రో డ్రగ్స్‌ సంస్థల ప్రతినిధులతో బాధిత రైతుల కమిటీ చర్చలకు అప్పటి ఎస్పీ చారు సిన్హా, నేను కలిసి ఒప్పించాం. ఆరుగురు రైతుల కమిటీతో జరిగిన ఒప్పందంలో 352 మంది రైతు కుటుంబాలకు పక్కా ఇళ్లు, మంచి నీరు, రోడ్లు, పాఠశాల కల్పించడంతో పాటు అర్హులైన వారికి ఆ సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు. 30 ఎకరాల్లో ప్లాట్లు వేశారు.. నాలుగు నెలల క్రితం నాటి సమాచారం ప్రకారం.. 145 మందికి వాచ్‌మన్‌, క్లర్క్‌ ఇతరత్రా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 106 మందికి సంస్థలు ఉపాధి కార్డులు ఇచ్చాయి. కొత్తగా ఇంకా ఎంతమందికి ఇచ్చారో? ఇవ్వనున్నారో తెలియదు’ అని కలెక్టరు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని రైతులు, రాజకీయ పార్టీల అవగాహన కోసమే చెబుతున్నానన్నారు.

Courtesy: Eenadu
Date: 27th April 2008

‘గూడు’కట్టని నిర్లక్ష్యం!


ఇళ్ల స్థానంలో బోర్డు మిగిలింది
ఉపాధీ ఎండమావే
పోలేపల్లి సెజ్‌ నిర్వాసితుల దుస్థితి
--------------------------------------------------------
పోలేపల్లి నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి
పోలేపల్లి పోలేపల్లి ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్‌) కోసం భూమిని ధారపోసిన అభాగ్యులు అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. వారికిచ్చిన హామీలు ఆచరణకు ఆమడదూరంలో ఉండిపోతున్నాయి. సెజ్‌ కారణంగా నిర్వాసితులయ్యే వారికి 200 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఘనంగా హామీ ఇచ్చింది. అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ఇళ్లకోసం స్థలం కేటాయించినట్లు సూచిస్తూ బోర్డు మాత్రం ఆర్భాటంగా పాతారు. అంతకుమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఉపాధి కల్పనకు ఇచ్చిన హామీ కూడా ఎండమావిగా మారుతోంది.మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద 969 ఎకరాలను 2003లో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) సేకరించింది. ఈ భూమిలో 250 ఎకరాలను ప్రత్యేక ఆర్థిక మండలి కోసం ఔషధ కంపెనీలకు కేటాయించింది. ఇందులో అరబిందో ఫార్మాకు, హెట్రో డ్రగ్స్‌ కంపెనీలకు 75 ఎకరాల చొప్పున కేటాయించింది. ఈ సంస్థలు నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టడంతో భూమిని కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. రైతులు గట్టిగా ప్రతిఘటించడంతో పోలీసులు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఏపీఐఐసీ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు (నెం:82/07) నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు జిల్లా కలెక్టర్‌ మానవహక్కుల సంఘానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. రైతుల ప్రతిఘటన, పోలీసు కేసుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఓ సమావేశం జరిగింది. సెజ్‌లో ఏర్పాటు కానున్న పరిశ్రమల్లో నిర్వాసితులకు కుటుంబంలో ఒకరికి చొప్పున ఉపాధి కల్పిస్తామని అంగీకరించారు. దీంతో పాటు 200 చదరపు గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణంతోపాటు అందుబాటులో ఉంటే సాగుకు ప్రభుత్వ భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులపై నమోదు చేసిన క్రిమినల్‌ కేసులు ఉపసంహరించుకోవడం, బాధితులు నిర్మాణ పనులు అడ్డుకోకుండా ఉండటం కూడా ఒప్పందంలో ముఖ్యమైనవి.
ఈ మేరకు కేసును లోక్‌అదాలత్‌ ద్వారా రాజీ చేసుకోవడానికి గత ఏడాది అక్టోబరు 11న కేసు ఉపసంహరణ పిటిషన్‌ దాఖలు చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా… మిగిలిన రెండు హామీల విషయంలో మాత్రం చుక్కెదురైంది. మందుల పరిశ్రమ కంపెనీలు నిర్మాణం ప్రారంభించే సమయానికి నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని, జనవరి ఆఖరునాటికి ఇళ్లలో చేరవచ్చని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నిర్మాణమే మొదలు కాలేదు. నిర్వాసితుల ఇంటి నిర్మాణాలకు కేటాయించిన స్థలం కూడా ఔషధ కంపెనీలను ఆనుకొనే ఉంది. ఈ కంపెనీలనుంచి వెలువడే కాలుష్యానికి అక్కడ నివాసం ఉండగలరా అన్నది ప్రశ్న.



ఇక నిర్వాసితులకు ఉపాధి అంశం కూడా కాగితాలకే పరిమితమయ్యేలా ఉంది. నిర్వాసితుల్లో ఎక్కువమంది దళితులు, గిరిజనులే. ఈ కుటుంబాల్లో చదువుకున్నవారు చాలా తక్కువ. ప్రస్తుతం వీరికి లభిస్తున్న ఉపాధి తమ భూముల్లో చేపట్టిన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేయడమే. నిర్మాణ పనులు ఎవరి భూముల్లో జరుగుతుంటే వారికి మాత్రమే కూలి పని ఇస్తామని మొదట కంపెనీల ప్రతినిధులు మెలిక పెట్టారు. నిర్వాసితులు నిలదీయడం, అధికారులు జోక్యంతో అందరికీ కూలి పనులు ఇచ్చేందుకు అంగీకరించారు. కార్డులు ఇచ్చి వారిని పనిలోకి తీసుకుంటున్నారు. అయితే ఈ పనులు చేయలేక తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తనకున్న ఐదెకరాల భూమి తీసుకొన్నారు, కూలి పని చేస్తుండగా కాలు దెబ్బతగిలింది, అయినా పని చేయక తప్పడం లేదని బచ్చన్న నిర్వాసితుడు వాపోయారు. ఇనుప కమ్మీలు మోయడం లాంటి పనులు చేయలేకపోతున్నామని ఓ మహిళ వాపోతే, మీ చేత కాదు వెళ్లిపోండని చెప్తున్నారని గంగమ్మ అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.





కుమిలి.. పోయారు

జడ్చర్ల సెజ్‌ మృతులు 40 మంది!
పౌరహక్కుల సంఘం వెల్లడిసర్కారుపై ధ్వజం

జడ్చర్ల గ్రామీణం - న్యూస్‌టుడే
కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలతో భూములు కోల్పోయి.. నానా బాధ అనుభవించి, రైతులు కుమిలిపోయి మరణిస్తున్నారని, దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి తమ నిజ నిర్ధారణలో తేలిన అంశాలని పౌర హక్కుల సంఘం పేర్కొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తండాలకు వెళ్లి.. రైతు కుటుంబాలను పరామర్శించారు. సంఘం సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రఘునాథ్‌, లింగయ్య, నారాయణరావు, లక్ష్మణ్‌ తదితరులు వారితో మాట్లాడారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు.
కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న పరిస్థితులు, చేస్తున్న పోరాటాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. భూములు అప్పజెప్పి ఏళ్లు గడిస్తే ఇప్పుడెందుకు ఆందోళన చేస్తున్నారనివారిని హక్కుల సంఘం నేతలు ప్రశ్నించారు. ‘2002 నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. భూములివ్వం అన్నాం. బెదిరించారు. పరిహారం వద్దన్నాం. తీసుకోకుంటే భూమి లాక్కొని జైలుకు పంపుతాం.. ఇదికూడా రాదు అన్నారు. దాంతో డబ్బులు తీసుకున్నాం. గతేడాది వరకు పంటలు పండించాం. వాటిని తీసివేశారు. ఆందోళన చేశాం. కేసులు పెట్టారు. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడే ఆందోళన చేయడం లేదు’ అని బాధితులు బదులిచ్చారు. ‘ఇప్పుడు ఎన్నికలున్నాయని అంతా వంగి దండాలు పెడుతూ వస్తున్నరు. కానీ ఇప్పుడు మేం ఎవరికీ ఓటేయ్యం మా ఊరిని నాశనం చేసిన వారిని, మా గురించి పట్టించుకోని వారిని ఊళ్లోకిరానివ్వం’ అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా దగ్గర భూములు లాక్కున్నారు. ఇప్పుడు సచ్చిపోతే బొందపెట్టనిస్తలేరు. జాగ లేదు’ అని గిరిజన మహిళ శివ్‌లీ వివరించారు. ఇళ్లు, స్థలాలు, ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. అనంతరం నిజనిర్ధారణ సంఘం సభ్యులు విలేఖరులతో మాట్లాడారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి: సురేశ్‌కుమార్‌
సెజ్‌ల పేరుతో ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. చెప్పేదొకటి చేసేదొకటి. పెద్దవాళ్లను ఇంకా పెద్దలుగా చేయడం, పేదలను ఇంకా పేదలుగా చేస్తోంది. ఇక్కడకు వచ్చి చూశాక సర్కారు వికృతరూపం బయటపడింది. జీవించే హక్కులు కాలరాస్తున్నారు. ఆదాయం, జీవనాధారం కోల్పోయి ప్రజలు అల్లాడుతున్నారు.
పోరాట క్రమంలో మరణిస్తున్నారు: రఘునాథ్‌
‘ఐదేళ్లుగా భూములు కోల్పోయి.. కుటుంబ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల క్రమంలో పోలేపల్లి, గుండ్లగండ తండాలో దాదాపు 40 మంది మృతి చెందారు. మా పరిశీలనలో స్పష్టంగా తేలింది. భూములు పోవడం వల్లే వారు మరణించారు. ప్రభుత్వం దళారీగా, భూములు కోల్పోయిన రైతులు కూలీలుగా మారారు.
ఆత్మగౌరవం దెబ్బతింటోంది: లక్ష్మణ్‌
భూములు కోల్పోయి ఆత్మ గౌరవం దెబ్బతిని దాదాపు 300 కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. కళ్లెదుటే ఉన్న భూములు పోయాయి. కూలీలయ్యామని బెంగ వారిని వేధిస్తోంది. ఇందిరాగాంధీ ఎస్సీ, ఎస్టీలకు భూములను పంచితే వైఎస్‌ ప్రభుత్వం లాక్కుంటోంది.
ఎవరికిచ్చారు ఉద్యోగం: లింగయ్య
జిల్లా కలెక్టరు వివరణ పరిశీలిస్తే వాస్తవాలు వేరే ఉన్నాయి. ఎవరికీ ఉద్యోగాలు కల్పించలేదు. కూలీ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలివ్వలేదు. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. అంతా బూటకం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బాధితుల పక్షాన పోరాడే వారి దృష్టి మళ్లించడానికే వివరణ ఇచ్చారు.
న్యాయం జరిగేదాకా ఉద్యమం: నంగారాభేరి
హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి గుండ్లగడ్డతండా సెజ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని లంబాడ హక్కుల పోరాట సమితి(నంగరాభేరి) ప్రకటించింది. ప్రభుత్వం పేదల నుంచి వందల ఎకరాల భూమి లాక్కుని పెద్దలకు కట్టబెట్టిందని నంగారాభేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్‌ శేషురాంనాయక్‌ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రైతుల్ని వారి భూముల్లోనే కూలీలుగా మార్చిన ప్రభుత్వానికి లంబాడాలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. భూములు కోల్పోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూములు లాక్కోవడంతోపాటు అక్రమ కేసులు బనాయించి బాధితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Courtesy: Eenadu
Date: 28th April 2008

నేడు సెజ్‌పై కలెక్టరేట్‌ ముట్టడి

జడ్చర్ల, ఏప్రిల్‌ 27 (న్యూస్‌టుడే): పోలేపల్లి సెజ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నట్లు భాజపా జాతీయ కిసాన్‌ మోర్చా సభ్యుడు డా.శౌరీ తెలిపారు. ఆదివారం జడ్చర్ల భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెజ్‌ బాధితులకు అన్యాయంపై పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సెజ్‌ నిర్వాసితులకు 2002లో పరిహారం చెల్లించామన్న కలెక్టర్‌ మాటలు వాస్తవం కాదన్నారు. భాజపా ఉద్యమం ప్రారంభమయ్యాక 2007 వరకు కూడా పరిహారాన్ని చెల్లించారని చెప్పారు. గత మార్కెట్‌ ధర అవాస్తమని, అప్పట్లో ప్రభుత్వ ధరను మాత్రమే చెల్లించారన్నారు. పారిశ్రామిక వృద్ధి కేంద్రం భూ సేకరణకు రైతుల సంతకాలు జాబితా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. భూ సేకరణలో భాగంగా రైతు పేర్లతో సంతకాలు ఫోర్జరీ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిలో నిర్వాసితుల ఆవేదన, సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తామన్నారు. సెజ్‌ దగ్గర తండా ఉంటుందా..? తొలగిస్తారా..? అనేది అధికారులు తేల్చాలన్నారు. ఈ విషయమై ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఎలాంటి సమాధానం చెప్పడం లేదన్నారు.

Courtesy: EenaduDate: 28th April 2008

SEZ displaced cup of woes overflows

-------------------------------------------------------------

Land from Polepally, Mudireddypally villages assigned to SEZ
Rs. 18,000 an acre for assigned lands too less for livelihood.
-------------------------------------------------------------
Nowhere to go: Widows of Polepally village whose lands have been acquired pour out their woes at a meeting in Hyderabad on Sunday.

HYDERABAD: “We have lost dignity along with livelihood. Not a sliver of land is left even to bury us after death. We fear nothing now as we stand to lose nothing,” Sukkamma, a woman from Polepally village of Mahbubnagar district says fuming with rage.
She is just one among the number of widows displaced. She came here to participate in a meeting by ViRaSam on Sunday aimed to express solidarity with them.
Sukkamma lost her 3.5 acres of land to the pharmaceutical SEZ coming up near her village. After she lost her husband Narsaiah, which she attributes to land acquisition, she and her matriculate son were working as construction labourers at the very site. She is also one among the 25 women from the village who will contest the coming byelections to Jadcherla constituency – as a token protest of their displacement.
The previous Government had acquired 1,000 acres of land from Polepally and Mudireddypally villages through APIIC while the present Government assigned a chunk of it for the SEZ. Vociferous protests by farmers were met with arrests and cases.
“Not even an inch of land belonged to the upper castes. All the cultivators were Dalits, STs and Minorities,” said Kagula Madhu, convenor of the ‘Polepally SEZ Vyatireka Aikya Sanghatana’.
Madhu claims that 30 to 35 farmers died of inexplicable reasons after the agitations. Whatever be the reason, the deaths certainly left many lives rudderless. Widows of the farmers have been left to fend for themselves and cope with all the sociological repercussions. “My two daughters were deserted by their husbands. I could not give the gold promised at the time of wedding. Having lost the land, I may never fulfil the promise,” Husani Rangamma, a widow who is preparing to contest elections said.
Compensation of Rs.18,000 per acre for assigned lands was way too less to make up for lost livelihoods. Though patta lands yielded about Rs. 30,000-Rs. 60,000 an acre, it was not enough to purchase alternative land. Even finding work was difficult.
-By-
Swathi.V

Thursday, May 1, 2008

SPECIAL ECONOMIC ZONES

SEZs. Horrible, inhuman, mad development zones one can ever imagine. I dont know how many of us aware of these so called SPECIAL ECONOMIC ZONES as it translates into reality on the ground. I don?t know the theory part of this madness. Andhra Pradesh stands second in the country to accommodate SEZs. Land is grabbed from the poor for by none other than Govt itself. It behaves like a blood hungry monster. Government operates through several agents who are like paalegallu of factionists or mercenaries of capitalists and transforms into a mafia etc. For Telangana region its like 'moolige nakka paina taati pandu padinattu', okavaipu abhivrudhi manthralu japisthoo maro vaipu prajalanu bichagaallagaa maarche pathakaalu..adige vaaru evaru leru, becasue its SEZ era!! Abhivrudi perutho attadugu vargala varipai vetu. I have been regularly meeting Polepalli villagers, who are fighting against pharma SEZ. Polepalli is right there in Jadcherla, not so far away from the HI TECH Shamshabad Airport. My childhood memories of going out of city is to see more greenery, houses and people and the tales of their lives. But now if we go to any national highway, we only have roads. Roads, and ROADS and ROADS and WIDER ROADS. Don?t know where they lead to? Wider and newer and more luxurious and adding more lanes as it becomes fatter. Destroying village life, culture, taking away their food, spreading pollution and killing the identities of people and cultures. Tale of Mahbubnagar is one saga. Mahbubnagar has to be sacrificial goat and has to suffer many poisonous evil designs of the witchcraft that money hungry thought system now spins off to make devour areas adjoining the monstrous Hyderabad. Thinking of asking what sin Mahbubnagar committed? Hyderabad pakkane undi inkaa bathiki undaalne??
We heard that 'paalamooru prajalu potta chethapattukuni desalaku poinru', ?raithulu atma hatyalu chesukundru? idi pata mata, ippudu oorla unna koddi mandi kuda, valla bhoomulalla valle bichagaallayi, banisalai e dikkunundi esonti pathakaalu vasthayo telavaka paanaalu arachetilo pettukunru. badaa baabulu, medhaavulu rikaam lekunda upanyaasaalu vollistunnaru. ?buvva bettetollu leru doraa?, cried Kurmaiah, farmer.
Polepalli is now filling page one of the dailies. In brief Polepalli tragedy is 1240 acres of arable land belonging to SC, ST, BCs acquired in 2001 by APIIC when TDP Govt was ruling. Villagers were told a green park was to be developed, that 'its govt order', and 'its for development'. During Congress regime the project started revealing its colors with the enactment of SEZ. Overnight it turned into Arbindo and Hetero drugs project. Drugs considered to dangerous to environment and the people. People started resisting and fighting from years. They approached every political party and requested begged for their support. Nothing much happened. All sorts of repression is let loose. Protesting villagers were beaten and put behind bars. So many jailed. Three villages affect and - Gundlagadda thanda, comletely wiped out.. Polepalli and Mudireddypalli! name sake they are there.
These villages are promised of good houses, better jobs and compensation. And how good the best policies are that these illiterate villagers could not appreciate is another important aspect of the tragedy. Govt rate for land that time was 18,000/- per acre. But many of them did not even receive 5,000/- per acre. ?mettu mettu kaada paisalu madam, maa chetiki emi migalale? says a woman who lost her husband in the fight with SEZ. Forty five farmers died with heart attack leaving children and wives to their fate in a world that is numb to being dead !! Women who are widows and are mothers of starving children and ravaged by the nightmares of what is store continue their struggle for justice. They are going to every place and knocking doors for justice. There is no political party that they have not approached. Just a few people's organisations are with these people. Telangana Ikya Karyacharana Committee Madhu Kagula is relentlessly working along with other villagers. These lands are sold and resold for higher prices , changing hands, right now its Arabindo, and Hetro Drugs, whats tomorrow no one knows.. and anybody else it can go for a higher price. Current price for which Arabindo pharma is selling the lands is mind boggling. It is Rs 41 lakh per acre. Friends it?s a big big BIG business of 50,000 lakhs at the conservative figures and its no surprise that its not just the lands that are sold and resold in SEZs its making politics and policies and theories and political parties into commodities. SEZs is making everything a saleable thing now. Anything is sold now like vegetables. And all voices of conscience become shameless and go silent as SEZ is taking lives of the poor farmers every day
One more startling thing is that Arabindo Pharma decided sometime back to withdraw and gave letter to the district Collector about its intent. But the MLA Laxma Reddy, of TRS party, took all pains and took it as a challenge to bring back that pharma company. Every farmer here has a story to narrate how this MLA went about buying the lands for the pharma company. ?sandulla sandulla tiska poyee santhakaalu pettichukonnadu saaru? told a farmer in pain. ?maaku saduvu raadhu, suttu pakkala sadhuvukunna maaraajulaku, leaderlaku emayindhi saaru? maa bathukulu anyaayam ayipothunte sodhyam soosukunta koosuntunaru endhuku saaru??, asks Senaaiah Goud in vain.
Gram sabha and governance is not there. Overnight you can take anyone's land promising anything. What does TRS do about such representatives who are working as agents of the SEZ and how will people believe anyone else now when our own messiahs are preying on its weaker ones.
Yesterday, VIRASAM organised a sabha in Hyderabad. All those affected people came voiced their problems and pains. ?Maa godu inte edvakunda undaleru evvalaina" told a farmer yesterday. He was beaten in the jai, is paralyzed some time back. And they were chased by the mafias like a pack of wolves running for the taste of blood. They were chased to run away from their own lands. evvalayina sare first SCla kaadiki vastharu. endukante maa dalitulaku e dhikku lekapaaye. Mundhu meme mosapotham. He told that how villages were died(killed?) step by step. around 300 acres was assigned land belonging to the dalits. they explained how many years they slogged and made that fit into a cultivable land to be only whisked away like this in the name of SEZ. Shivli. is a woman who lost 12 acres, mother of five small kids, is waging a lone battle. She didnt receive any money till now. naaku padendlappude bhumi unndani 50 endloniki ichi pendli chesindru. eduguru pillalalla iddaru poinru. Gee santi pillalu unnaru. She was cooking and living in her land under the shade of tamarind tree and fighting to get back the land. Overnight the tree was cut by the land grabbing fellows to push her out from the shade of chinta chettu. maa aayana chavukukooda paisalu lekunda chesinru. (we didn?t have a rupee for the funeral expenses of my husband. They made me a beggar). Who made me a widow to take care of five small kids?
Shivli haunts and disturbs me. What made her life miserable? What?s in store for her? Is her sole sin is to be born in Telangana which is facing a war and people are killed everyday. Our leaders and scholars and intellectuals, who are so far away and silent on this tragedy, need to answer and become part of people who are dying and fighting in our Telangana.
Anjamma, Chukkamma, Rajamma, velugulamma... So many women we heard, who lost their husbands. Each one has a miserable story. Male farmers are just heart broken and tired of fighting but some are still looking for help. They look to sanity and humanity left in the world and Telangana people. They look towards us, the so called educated intelligent and powerful and influential in cities and big positions.
Ratnamala, renowned social activist, who presided the meeting rightly asked. Is it not an issue of whole people, an issue of we all people ? is it an issue of just these farmers of three villages or these women and their dying spouses?? SEZ has no laws, it doesn?t permit any law. Some say it is development and someone has to pay the price. Today we are buying 20 kg or 25 kg rice, if we develop do we eat computer chips?? how are we going to survive when cultivable land and the right of someone to live made thing for sale and stuff for somebody profit hunger? This is not less than any Hiroshima Nagasaki, she told. Many farmers complained of losing vision due some other company, Peddavagu got polluted, youth can?t see anymore. Perhaps its better to be blind than seeing all these tragedy watched by the world in shameless silence, i feel. Srinivas, a young activist, said they only had one day celebration in a year- pedda pandaga. Its called GAMPA JATARA. andari laaga memu anni panDagalu chEsukoni tinalemu. chelallaki pothamu..kammaga kokilalu koosthuntayi chuttuakkala We have community meal. But where do we go now? All trees and forests are replaced by companies, kampugotte companeelu (stinking companies). "maa bathukulu kukkalakanna heenanga unnayi" painunchi rendu roopayila biyyam, kinda nunchi bhumulu laguthunru. our MLAs pendlillaki ochi tini potaru gani, problems vasthe ayenkalla guda raaru". Kurmaiah, farmer says that 'polepalliki pillanevalu isthaleru'..uru wada, polam, pashuvulani chusi pellillu jaruguthai kada.. Its not just an economic issue. Its also social, cultural, ethical, health , environmental, women and child issue of Telangana and all regions. Friends. There are some SEZ are coming in Mahaboobnagar, Warangal and other districts.. I think we should respond immediately and stand with our people in distress. We need to support their struggle and save their lands, help them save their mother. We are not against development. Maa bathukulu maaku vadhileyyandi. Bangaaru katthi anee meda.
kosukuntamaa? Poor people cannot afford this development and let this development be done in rich peoples land and in rich regions and become more developed! We dont want such projects. Let them go to rich people's lands, who can still survive and become more developed and also understand the need of development. Now Telangana cannot afford any more of this exploitation and raakshasatvam.
Politicians will come and go, elections will come and go. If leaders are good, people will vote for them. votlu eyyam, inka etlu estham, says a Srinivas. Who will stop people's decision? They are the better people to judge their own lives. First prime important issue is to save Telangana.
Ratnamala rightly said that protesting imperialistic culture starts again from these farmers only. Forgot to mention one great soul Sri Upender Reddy (upa sarpanch) who supported and went with them everywhere. He did not have any threat for his land, Yet he stood with the people and was part of their struggle. He faced so many threats and passed away. Every farmer remembers him. Isn?t that enough for a person to live for eternity and live in the hearts of one?s people??? joharlu to him!! Some of us here along with Telangana Ikya Karyacharana Committee and other groups are trying to unite strengthen the struggle and mobilize support for the people of Polepalli and also join with people challenging SEZs across the state and country. Trying to gather people's support. You all know every support is required today for these people who are fighting injustice with barely any resource. They need moral, physical and monitory support. Each drop will make an ocean. All those people who are here in Telangana and abroad can contribute for this great noble cause.

Save Telangana! Save people, fight SEZs
Jai Telangana
Sujatha Surepally